హైదరాబాద్, మహా
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల చేశారు. తొలిసారిగా విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఇంటర్మీడియట్ బోర్డు హాల్ టికెట్లు పంపింది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. కళాశాల ప్రిన్సిపల్స్ నుంచి కూడా హాల్ టికెట్లు తీసుకునే అవకాశం కల్పించారు. 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న ఫస్ట్ ఇయర్, 26వ తేదీన సెకండియర్ పరీక్షలు మొదలు కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల కాలపట్టికను ఇంటర్ బోర్డు గతంలో విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు.
Post Views: 3








