మధిర జులై 1
మధిర మండలం వంగవీడులో ఈనెల 3న జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తారని మధిర వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరసింహారావు అన్నారు. మంగళవారం శంకుస్థాపన ఏర్పాట్లను మార్కెట్ చైర్మన్ పరిశీలించారు. ప్రభుత్వం సుమారు రూ.630 కోట్ల వ్యయంతో భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు
Post Views: 23








