పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ పాలక వ్యవస్థపై మరోసారి విరుచుకుపడ్డారు. “బానిసగా జీవించడం కన్నా జైలులోని చీకటి గదిలో ఉండటమే నాకు మేలు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ చీఫ్, న్యాయవ్యవస్థ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. 26వ రాజ్యాంగ సవరణ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందంటూ ఆరోపించారు. ఈ మేరకు జూలై 6 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాలంటూ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
Post Views: 95








