AP: స్వర్ణాంధ్ర-పీ4 లోగోను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. శుక్రవారం ఏపీ సచివాలయంలో సీఎం అధ్యక్షతన స్వర్ణాంధ్ర-పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. వివిధ స్థాయిల్లో పీ-4 అమలుపై రెండు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీల్లో సభ్యులుగా ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉంటారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి పీ4 అద్భుతమైన వేదికని సీఎం తెలిపారు.
Post Views: 92








