ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘గుంటూరు జిల్లా మన్నవ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపేప్రయత్నం చేశారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు’ అని జగన్ ప్రశ్నించారు.
Post Views: 60








