TG: ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ LB స్టేడియంలో జరుగుతున్న ‘కాంగ్రెస్ సామాజిక సమర భేరి’ సభలో సీఎం మాట్లాడుతూ.. “తమకు ఎదురులేదని భావించిన కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టాం. కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటారని, కలిసి ఉండలేరని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఐకమత్యంతో పని చేస్తూ అపోహలను పటాపంచలు చేశారు. 18 నెలల్లోనే దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ మోడల్ ఆవిష్కరించాం” అని అన్నారు.
Post Views: 79








