Mahaa Daily Exclusive

  జగన్ పర్యటనలో 500 మందికి అనుమతి: ఎస్పీ

Share

AP: చిత్తూరు జిల్లాలో జులై 9వ తేదీన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే హెలిపాడ్ వద్ద 30 మందికే అనుమతిచ్చారు. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు.

Latest