Mahaa Daily Exclusive

  చంపేస్తామంటూ కేంద్ర మంత్రికి బెదిరింపులు..!

Share

కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌‌ను చంపేస్తానంటూ ఓ దుండగుడు బెదిరించాడు. చిరాగ్‌ను హతమారుస్తామంటూ ‘టైగర్‌ మెరాజ్ ఇడిసి’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారని పార్టీ ప్రతినిధి రాజేశ్‌ భట్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. బీహార్‌లో రానున్న ఎన్నికల్లో పాశ్వాన్‌ పోటీ చేస్తారని, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగానే ఈ బెదిరింపులు వచ్చాయన్నారు. దీనిపై పట్నాలోని సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Latest