Mahaa Daily Exclusive

  నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..!

Share

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మాన్సుఖ్ మాండవీయ తదితరులను కలిసే అవకాశం ఉంది. అలాగే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తిమంత్రితో పాటు CWC అధికారులతో సమావేశం కానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి జరిగే లబ్ధి, ఇటీవల తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.

Latest