AP: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ భేటీలో టీడీపీ ఎంపీలతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా హాజరుకానున్నారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించనున్నారు.
Post Views: 84








