AP: లిక్కర్ స్కాం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇంకా భారీ మోతాదులో అవినీతి బయటపడే అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.3,200 కోట్ల మేర స్కాం జరిగినట్లు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా అది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు. తవ్వకాలు కొనసాగినంత కాలం కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయని తెలిపారు.
Post Views: 56







