AP: పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన TDP నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు YCP అరాచకాలపై శేషగిరిరావు పోరాటం చేసిన యోధుడని, ఆయన త్యాగం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.
Post Views: 106







