AP: మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు వైసీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘కొందరు చరిత్ర హీనులు ఉంటారు.. వారి గురించి మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకోలేను’ అని సెటైర్ వేశారు. జగన్ రెడ్డి నిజంగా ప్రజాహితం కోరితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదన్నారు. ఇక, ప్రశ్నించడానికి ఏమీ లేదు కాబట్టే జగన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు గత 13 నెలల కాలంలో 56 సార్లు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారన్నారు.
Post Views: 42







