ఆదిలాబాద్, మహా :
నూతనంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన మల్లెపూల నర్సయ్య శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ ను సందర్శించారు. అసెంబ్లీ ఇచార్జి కంది శ్రీనివాస రెడ్డి తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు పూల బొకేలతో ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, గిమ్మ సంతోష్, సెడ్మకే ఆనంద్ రావు, భూపెల్లి శ్రీధర్,లోక ప్రవీణ్ రెడ్డి, అల్చెట్టి నాగన్న, సుధాకర్ గౌడ్, కొండూరి రవి, ఎం ఏ షకీల్ ,రఫీక్ , శ్రీలేఖ ,దాసరి ఆశన్న తదితరులు హాజరయ్యారు.
Post Views: 35







