ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, వైఎస్ జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత జగన్కు లేదని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని, ఆయన ఎవరికీ లొంగలేదని తెలిపారు. ఓట్ల చోరీపై రాహుల్ పెద్ద యుద్ధం చేస్తున్నారని, ఈ అంశంపై జగన్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో జరగనున్న కాంగ్రెస్ ర్యాలీకి మద్దతు ఇవ్వాలని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు.
Post Views: 60






