Mahaa Daily Exclusive

  సీఎం నివాసంలో కాంగ్రెస్ కోర్‌ కమిటీ సభ్యుల భేటీ…!

Share

TG: జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కోర్‌ కమిటీ సభ్యులు ఇవాళ సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌గౌడ్, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో జరిగే పీఏసీ, అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు, యూరియా కొరతపై చర్చించే అవకాశముంది.

Latest