Mahaa Daily Exclusive

  రాహుల్‌కు ఓటమి భయం పట్టుకుంది: అనురాగ్ ఠాకూర్

Share

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలను బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ‘రానున్న బిహార్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం రాహుల్‌కు పట్టుకుంది. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఆయన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను నిందిస్తుంటారు. ఈసారి పోలింగ్‌కు ముందే ఈసీపై ఆరోపణలు చేస్తున్నారు. దేశ రాజ్యాంగ వ్యవస్థపై ప్రతిపక్ష నేతలు విశ్వాసం కోల్పోవడం దురదృష్టకరం’ అని తెలిపారు.