Mahaa Daily Exclusive

  పేదలకు ఇళ్ళు.. కేవలం రూపాయికే ఇంటి ప్లాన్!

Share

AP: పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. 50 చదరపు మీటర్లలోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకుంటే రూపాయికే ఇంటిప్లాన్‌ లభించనుంది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు వారి పరిధిలోని కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా ప్లాన్‌ పొందుతారు. దీనివల్ల లబ్ధిదారులకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మిగులుతుంది.