AP: నోటీసులు ఇచ్చిన దివ్యాంగ పింఛన్దారులందరికీ ఈనెల పింఛన్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఉదయం యధావిధిగా సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకు గ్రామ, మండల స్థాయి అధికారులకు సెలవులు ఉండవన్నారు. దివ్యాంగుల పింఛను తొలగింపుపై వైసీపీ చేస్తున్న ప్రచారమంతా అవాస్తవమన్నారు.
Post Views: 35






