AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తమ టార్గెట్ కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ టార్గెట్ అని మంత్రి తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికతోనే జగన్ సినిమా అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని గొట్టిపాటి సవాల్ విసిరారు. జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనా కాలం రాష్ట్రానికి చీకటి రోజులని మంత్రి అన్నారు.
Post Views: 29






