మారుతున్న సాంకేతికతను మహిళలు అందిపుచ్చుకోవాలని రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి పేర్కొన్నారు. చట్టసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సులో సాంకేతికంగా మహిళలకు ఎదురయ్యే సవాళ్లు, పరిష్కారాలపై చర్చ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఆదివారం మాట్లాడారు. ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీపై మహిళలు అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. స్టెమ్ విభాగంలో మహిళల ప్రాతినిథ్యం పెరగాలని సుధామూర్తి వెల్లడించారు.
Post Views: 107






