Mahaa Daily Exclusive

  జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలి: సీతక్క

Share

TG: ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. బైక్‌పై తిరుగుతూ జాతర పనులను ఆమె పరిశీలించారు. కొందరు స్వార్థంతో మేడారం జాతరపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని.. గద్దెలు మారుస్తున్నామని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. గద్దెల అభివృద్ధికి ఇంకా DPR కూడా సిద్ధం కాలేదని మంత్రి స్పష్టం చేశారు. మేడారం జాతరపై చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సీతక్క వెల్లడించారు.

Latest