TG: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వెళ్లినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
Post Views: 19






