ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి జైనథ్ మండలంలో పర్యటించారు.మండలం లోని బెల్గం గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు , గ్రామస్తులతో కలిసి సమస్యలపై చర్చించారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు గురించి చర్చించారు. ఇంటింటికి సంక్షేమ పథకాల గురించి వివరించాలని కంది శ్రీనివాస రెడ్డి శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్గం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 16






