AP: వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచారని, జెన్కో, ట్రాన్స్కో సంస్థలను సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి నష్టం చేకూర్చారు. పీపీపీలు రద్దు చేసి ఒప్పందం చేసుకున్న సంస్థలను ఇబ్బంది పెట్టారు. సూర్యఘర్ పథకం కింద ఏపీకి 20లక్షల కనెక్షన్లు వచ్చాయి. సౌర పలకలు ఏర్పాటు చేసుకున్న వారికి రాయితీ ఇస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు.
Post Views: 90







