TG: ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామని సీఎం రేవంత్ అన్నారు. ఆదివారం శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్, దుబాయ్లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదు? ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది’ అని అన్నారు.
Post Views: 56






