ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. భారీ వర్షం మధ్య జరిగిన రావణ దహనం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన విజయానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవత్వంపై దాడి చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టడం అవసరమని, ఇందుకోసం సైనికులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు.
Post Views: 50








