తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం ఏపీలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని తీరప్రాంతాల్లో గంటకు 50 – 70 కిమీ వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులను రెండు రోజులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
Post Views: 62








