ఖైరతాబాద్ నియోజకవర్గంలో
బీఆర్ఎస్ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి పర్యటన
ప్రజలతో మమేకం
ఖైరతాబాద్, మహా
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర డివిజన్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి విసృతంగా పర్యటించారు. రోడ్ నెంబర్ 10 లో మంచినీటి సమస్య , రోడ్డు సమస్య లను స్థానికులు ఆయన దృష్టికి తేగా, సమస్యను త్వరగా పరిష్కరించాలని జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ కున్వర్ , వాటర్ వర్క్స్ అధికారి విఠల్ కు ఫోన్ చేశారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని, ప్రజల ఇబ్బందులపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మర్ అబ్బాస్ , అంజద్ శౌరి , రాజ్ భీంశ, ధనరాజ్, శశి రాజ్ , స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 30








