మహా
….
“రానున్న రోజుల్లో మేము ఇరాన్లోని ఉగ్రవాద పాలకులకు చెందిన వేలాది లక్ష్యాలపై విరుచుకుపడతాం. ధైర్యవంతులైన ఇరాన్ ప్రజలు తమను తాము, ఈ క్రూరమైన నిరంకుశ సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు అవసరమైన పరిస్థితులను మేము సృష్టిస్తాం. అందుకే నేను మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇరాన్ పౌరులారా ఈ గొప్ప అవకాశాన్ని చేజారనివ్వకండి. ఇలాంటి అవకాశం తరానికి ఒక్కసారే వస్తుంది.”
– నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని
అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ ఎటాక్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో ఆదేశం ప్రతీకార దాడులకు దిగింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. వీటిలో ఇజ్రాయెల్లోని టెల్ నోప్ ఎయిర్వేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యాలతోపాటు రక్షణ రంగ ఫ్యాక్టరీలు కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్పీ షిప్పై ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’లో భాగంగా, 4 డ్రోన్లతో దాడి చేసినట్లు టెహ్రాన్ వెల్లడించింది.








