- భారీగా మోహరించిన పోలీసులు
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేడు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
డిసిపి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈరోజు శనివారం పోలీస్ బందోబస్తు భారీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు మోహరించడం జరిగింది. చైర్మన్ ఎన్నిక సమయంలోఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించడం జరిగింది.
Post Views: 512








