- హిందువుగా మారి పెళ్లి చేసుకున్నాడు
- ఫస్ట్ నైట్ రోజే అమ్మాయికి మత్తు మందు ఇచ్చి నలుగురు అత్యాచారం
- ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు
- తీరా అతనికి 3 వివాహమని తెలిసి షాక్ కు గురైన నవ వధువు…
- అమ్మాయి ప్లాట్, బంగారంతో పాటు.. అమ్మాయి పై లోన్ లు తీసి జంప్…
- హవాలా వ్యాపారం చేసేవాడిని.. ఇతర రాష్ట్రాలకు హవాలా డబ్బులు పంపించేవాడని అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు
- కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్, మహా: కేరళ ఫైల్స్ లాగా హైద్రాబాద్ కూకట్ పల్లిలో లవ్ జిహాద్ కేసు వెలుగులో వచ్చింది. హైద్రాబాద్ కి చెందిన ఓ హిందు అమ్మాయి షాప్ అద్దెకు కావాలని *నవాజ్* అనే వ్యక్తి వచ్చాడు. షాప్ అద్దెకు తీసుకున్నాడు. అనంతరం హిందు అమ్మాయిని ట్రాప్ చేసి నవ దుర్గా గా పేరు మార్చుకొని హిందువుగా మతంలోకి మారినట్లు చిత్రీకరించి 2025 జూన్ లో వివాహం చేసుకున్నాడు. కూకట్ పల్లి నుంచి పంజాగుట్టకు మకాం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసాడు. అతని సోదరులు, స్నేహితులైన మున్నవార్, షారుక్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. అమ్మాయికి కూడా మత్తు మందు ఇచ్చి అందరూ అత్యాచారం చేసారని బాధితురాలు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి అనంతరం అమ్మాయికి సంబంధించిన ప్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద లోన్ లు తీయించ్చాడు. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. దింతో కూకట్ పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం హవాలా డబ్బులు వ్యాపారం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం పై జీరో ఎఫ్ఐఆర్ చేసి పంజాగుట్టకు పంపిస్తున్నట్లు సమాచారం.








