చిత్తూరు జిల్లా రంగంపేటలో పౌరుషాలపట్టు.. జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున జల్లికట్టు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జల్లికట్టు కోసం సిద్ధం చేసిన కోడెద్దులు గ్రామ వీధుల్లో రంకెలు వేస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం తో పాటు తిరుపతి, పీలేరు నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి జల్లికట్టును తిలకిస్తున్నారు. జల్లికట్టు పోటీల్లో పశువులకు ప్రత్యేకంగా అమర్చిన బహుమతి పలకలతో కూడిన పౌరుషాల కోడె ఎద్దులను రంగంపేటలోని వీధుల్లో వదిలిపెట్టగా.. వాటికి ఎదురెళ్లి వాటిని లొంగ తీసుకొని వాటికి కట్టి ఉన్న పలకల బహుమతులను తమ సొంతం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో యువకులు పోటీలు పడుతున్నారు.
Post Views: 64








