Mahaa Daily Exclusive

  బెంగుళూరులో హోటళ్ళు బంద్…

Share

  • బెంగుళూరులో హోటళ్ళు బంద్
  • యుద్దం ఆగేదాకా ఇంతే
  • దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే సీన్

మహా

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయిందని, దీంతో రేపటి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది.