రెస్పాన్సిబుల్ AIకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని PM మోదీ తెలిపారు. వచ్చే ఏడాది భారత్లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ నిర్వహిస్తామన్నారు. ‘వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో భారత్ AIని సమగ్రంగా ఉపయోగిస్తోంది. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. డిజిటల్ కంటెంట్ ప్రామాణికతను ధృవీకరించే గ్లోబల్ స్టాండర్డ్స్ తేవాలి. కంటెంట్ మూలం తెలిస్తే.. పారదర్శకత ఉండి, దుర్వినియోగాన్ని కట్టడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
Post Views: 44







