ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పంపిన విధానంపై మాజీ సీఎం జగన్ ఆరోపణలు చేసిన రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తీసుకెళ్లడానికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్ ల నుండి ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుక తీసుకు వెళ్లడానికి అవకాశం ఉండేది.
అయితే స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్ నుండి ట్రాక్టర్లలో కూడా ఇసుక తీసుకు వెళ్ళడానికి అనుబతి ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఇసుక వ్యాపారమే చేశారని గతంలో చంద్రబాబునాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే. మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం అమలులోకి తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందే నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.
చంద్రబాబు అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చింది. తక్కువ ధరకే ఇసుక తీసుకెళ్లడానికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక రీచ్ ల నుండి ఎడ్ల బడ్లలో ఫ్రీగా తీసుకొని తీసుకువెళ్లడానికి మాత్రమే ఇన్ని రోజుల అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ట్రాక్టర్ లో కూడా ఇసుక తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నామని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతరుల జారీ చేసింది.
ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేయడంతో చిన్నచిన్న ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికార పార్టీ నాయకులకు ఇసుక కాంట్రాక్టులు ఇచ్చిందని మాజీ సీఎం జగన్ శుక్రవారం ఆరోపించారు. జగన్ ఆరోపణలు చేసిన కొన్ని గంటల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ట్రాక్టర్లలో కూడా ఉచితంగా ఇసుక తీసుకు వెళ్లడానికి అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.








