గత నెల హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ సాయిరాం ఐదు కిలోమీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్బంగా పతకాన్ని సాధించిన కానిస్టేబుల్ ను కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తు మరిన్ని పతకాలను సాధించి ఇతరులకు స్ఫూర్తి కావాలని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అడ్మిన్ స్పర్జన్ రాజ్ పాల్గొన్నారు.
Post Views: 112







