Mahaa Daily Exclusive

  వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు: సత్యకుమార్

Share

వైసీపీ నేతలపై బీజేపీ నేత, మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోశాల అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడ్డారు. గోశాలలో ఏం జరుగుతుందో చూపిస్తాం రమ్మంటే రాకుండా.. ఇంటి ముందు పడుకుని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. గోశాలలో వయసు రీత్యా మాత్రమే గోవులు మరణించాయన్నారు. వేల ఆవులు ఉన్న చోట ఇలాంటి మరణాలు సహజమేనని పేర్కొన్నారు.