Mahaa Daily Exclusive

  వక్ఫ్ చట్ట సవరణతో పేద ముస్లింలకు న్యాయం: కేంద్ర మంత్రి

Share

వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ విషయంలో ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. మంచి ఉద్దేశంతో బిల్లు తీసుకు వస్తే మత కోణంలో విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రతిపక్ష పార్టీలకు తగదన్నారు.