Mahaa Daily Exclusive

  ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు: జగన్

Share

AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పతనమయ్యాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై ప్రణాళిక ప్రకారం తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అది సాధ్యపడకపోతే ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు.