AP: మాజీ మంత్రి, YCP నేత మేరుగు నాగార్జున ఆదివారం DGPని కలసి, పులివెందుల ఉపఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాలు మార్చడం, ఎన్నికల స్లిప్పులు పంపిణీ చేయకపోవడం, వందలాది YCP కార్యకర్తలపై కేసులు పెట్టడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు. మాపై దాడులు చేసి మాపైనే కేసులు పెట్టడం న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించిన ఆయన, ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరిగితే YCP విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
Post Views: 70







