కరీంనగర్, హైదరాబాద్, మహా: బీసీ బంద్ నేపథ్యంలో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు శ్వేత, కల్పన, ప్రతిమ తదితరులు హోటళ్లలోకి సామాన్లు, ప్లేట్లు పగలగొట్టి ఆందోళన వ్యక్తం చేశారు. బంద్కు మద్దతివ్వకుండ ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతంలో బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. బంద్ను పాటించకుండా తెరిచి ఉన్న బజాజ్ షోరూంతో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్పై ఆందోళనకారులు పెద్ద సిమెంట్ బ్లాక్స్తో దాడి చేశారు. దీంతో షోరూం అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతేకాక తెరిచి ఉన్న పెట్రోల్ బంక్పై దాడి చేసి ఫ్యూయల్ మెషిన్లను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు
Post Views: 33








