Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్: మాదిగ కులస్థుల సంబరాలు…!

Share

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆదిలాబాద్‌ పట్టణంలో ఆదివారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఖానాపూర్ కాలనీలో మాదిగ కులస్థులు కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ సమాజానికి ఎంతో సేవ చేశారన్నారు. పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.