Mahaa Daily Exclusive

  అంతర్వేది ఉత్సవాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలి…!

Share

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తీర్థ మహోత్సవాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులకు సూచించారు. ఆలయం వద్ద జరుగుతున్న ఉత్సవాల పనులపై ఆదివారం ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్, ఆర్&బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. అంతర్వేది ఉత్సవ కమిటీ ఛైర్మన్ దిరిసాల బాలాజీ, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.