జమ్మూకశ్మీర్లోని ఉగ్రదాడి ఘటన పట్ల కలత చెందినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రదాడుల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కిషన్రెడ్డి తెలిపారు. “మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య” కిషన్రెడ్డి అన్నారు.
Post Views: 151








