మణుగూరు వాగు మల్లారం వద్ద బ్రిడ్జిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో అటువైపు ప్రయాణాలు చేయవద్దని తహశీల్దార్ అద్దంకి నరేశ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో ఆ మార్గంలో ప్రయాణించడం సురక్షితం కాదని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు
Post Views: 34






