TG: సీఎం రేవంత్, బీజేపీ మధ్య రహస్య మైత్రి కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. చోటే భాయ్కి చీమ కూడా కుట్టకుండా బడే భాయ్ పార్టీ బీజేపీ పహారా కాస్తుందని విమర్శించారు. ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా.. రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా, బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందని ధ్వజమెత్తారు. గ్రూప్-1లో అవకతవకలపై పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర బీజేపీ దీనిపై స్పందించలేదన్నారు.
Post Views: 33






