Mahaa Daily Exclusive

  హైదరాబాద్ నగరాన్ని పట్టించుకునే నాధుడే లేడు: కేటీఆర్

Share

TG: హైదరాబాద్‌ను ప్రస్తుతం పట్టించుకునే నాధుడే లేడని, నగరంలో నేరాల రేటు 41% పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని పేర్కొన్నారు. చందానగర్‌లో పట్టపగలే బంగారం షాపులో దొంగతనం జరిగిందని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తర్వాత ఒక్క మంత్రి కూడా కనిపించడని విమర్శించారు. హైదరాబాద్ ప్రజల కోసం ఎన్నటికైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాడుతుందని కేటీఆర్ చెప్పారు.

Latest