AP: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయించింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఈ వ్యవస్థలోకి 8వేల మందిని తీసుకోవాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి నేతలకు సూచించారు. గ్రామాల్లో 7, మండలాల్లో 15 కమిటీలు నెట్వర్క్ ఉండాలని, నవంబర్ 20 నాటికి ఇవి పూర్తికావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంక్రాంతికి వీరికి ఐడీ కార్డులు ఇస్తామని టెలీకాన్ఫరెన్సులో వెల్లడించారు.
Post Views: 38







