Mahaa Daily Exclusive

  రెండు నెలల గడువు కోరిన స్పీకర్….

Share

  • ఫిరాయింపు ఎంఎల్ఏల విచారణ
  • రెండు నెలల గడువు కోరిన స్పీకర్
  • నలుగురు ఎంఎల్ఏలను విచారించామన్న అసెంబ్లీ కార్యదర్శి

హైదరాబాద్, మహా : ఫిరాయింపు ఎంఎల్ఏలపై విచారణ గడువును పొడిగించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రింకోర్టును అభ్యర్థించారు. తెలంగాణ అసెంబ్లీ తరపున లాయర్లు శుక్రవారం కోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల విచారణకు సుప్రింకోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31తో ముగుస్తుంది. అయితే విచారణ ఇంకా పూర్తికాలేదు. అనర్హత వేటును ఎదుర్కొంటున్న పదిమంది ఎంఎల్ఏలను విచారించి రిపోర్టు సబ్మిట్ చేయాలని సుప్రింకోర్టు మూడునెలల క్రితం స్పీకర్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ జరిపి రిపోర్టు అందచేసేందుకు అప్పట్లో స్పీకర్ కు సుప్రింకోర్టు మూడునెలలు మాత్రమే గడువిచ్చింది. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ మొదలుపెట్టినా హాజరయ్యింది నలుగురు ఎంఎల్ఏలు మాత్రమే. ఎందుకంటే కోర్టులో జరిగినట్లుగానే ప్రతి ఎంఎల్ఏ తరపున వాదన వినిపించేందుకు లాయర్లు, ప్రతివాదన వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంఎల్ఏల తరపున లాయర్లకు స్పీకర్ అవకాశాలు ఇస్తున్నారు. అంటే ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్. అందుకనే చాలా సమయం పడుతోంది. ఇదే విషయాన్ని స్పీకర్ తరపు లాయర్లు తమ పిటీషన్లో సుప్రింకోర్టుకు విన్నవించారు. మధ్యలో మూడువారాలు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్ళొచ్చారు. మరో ఎడుగురు పిరాయింపు ఎమ్మెల్యేలను విచారించాల్సిన అవసరం ఉన్నందున గడువు కావాలని స్పీకర్ కోరారు. స్పీకర్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

Latest